రైతులకు జనసేన ఎప్పుడూ అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాయలసీమ పర్యటనలో భాగంగా నేడు చిత్తూరు జిల్లాలోని మదనపల్లి టమాటా మార్కెట్ను ఆయన సందర్శించారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
స్వయంగా ఆయన రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి ఆరునెలలు గడుస్తున్నా రైతు గురించి పట్టించుకోలేదని విమర్శించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చెందుతున్నారని అన్నారు.