telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఢిల్లీ బయల్దేరిన పవన్ … మోదీ, అమిత్ షాలతో భేటీ?

pawan-kalyan

విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ బయల్దేరారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకే ఢిల్లీకి పవన్ కల్యాణ్ వెళ్లినట్టు పార్టీ శ్రేణులు చెబుతున్నప్పటికీ… ఢిల్లీ పెద్దలను కలిసేందుకు ఆయన వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పవన్ కలవనున్నట్టు తెలుస్తోంది.

ఈ భేటీల సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను వారికి వివరించనున్నట్టు సమాచారం. అవసరమైతే మోదీ, అమిత్ షాలను కలుస్తానంటూ ఇంతకు ముందు పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆయన ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

 

Related posts