telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదు: పవన్

ప్రజా సమస్యలపై పోరాటం అంటే తనకు ఇష్టమని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సోమవారం ఆయన కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పవన్‌ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదని ఆయన చెప్పారు. మోసం చేయడానికి తాను రాజకీయాల్లోకి రాలేదని వ్యాఖ్యానించారు.

కర్నూలును రాజధానిని మించిన నగరంగా అభివృద్ది చేస్తామని పవన్‌ హామీ ఇచ్చారు. జనసేన ప్రభుత్వంలో మండలానికో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని పవన్‌ అన్నారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా పర్సనల్‌ గేమ్‌ప్లాన్‌ చేసుకుంటే ఎలా? అని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేలు చట్టసభలకు వెళ్లకపోవడంతో రాష్ట్రంలో సమస్యలు పెరుగుతున్నాయన్నారు.

Related posts