telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టన్ను ఇసుక ధర రూ.370 అని చెప్పి.. రూ.900 వసూలు : పవన్ కల్యాణ్

pawan-kalyan

టన్ను ఇసుక రూ.370 అని చెప్పి అదనంగా రూ.900 వసూలు చేస్తున్నారని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.గుంటూరు జిల్లా నవులూరులోని ఇసుక స్టాక్ పాయింట్ ను ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇసుక కొరత కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను భవన నిర్మాణ కార్మికులు, నిర్మాణదారులు పవన్ దృష్టికి తెచ్చారు.

ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణాలు ఆగిపోయాయని, టన్ను ఇసుకకు రూ.900 వసూలు చేస్తున్నారని కార్మికులు చెప్పారని అన్నారు. కొత్త ఇసుక విధానం ప్రకారం ప్రభుత్వం ప్రకటించిన ధరకే ఇసుకను విక్రయించాలని డిమాండ్ చేశారు. పారదర్శకత కోసం కొత్త విధానం అమలు చేసినప్పుడు చెప్పిన ధర ప్రకారం ఇసుక విక్రయించాలని సూచించారు. ప్రభుత్వ విధానాలపై ఎలాపడితే అలా విమర్శలు చేయమని పేర్కొన్నారు.

Related posts