టీఆర్ఎస్, వైసీపీ రహస్య చర్చలు ఏపీ ప్రజలకు తెలిసిపోయాయని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్, చంద్రబాబుకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఆయనకు గిఫ్ట్గా మారుతుందన్నారు. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే… నేరుగా ఏపీలో కేసీఆర్ పోటీ చేయాలని అన్నారు. పదేళ్లు భావోద్వేగాలతోనే గడిచిపోయాయని.. ఇక చాలు ఆపండని అన్నారు.
ఏపీలో జగన్తో కలిసి పోటీచేయాలని తెలంగాణ స్నేహితులు కొంతమంది చెప్పారన్నారు. టీడీపీని లేకుండా చేసి ఆ తర్వాత మీరిద్దరూ తేల్చుకోండని సూచించారని ఆయన చెప్పారు. అయితే జగన్పై తన అభిప్రాయాలు ఎలా మార్చుకుంటానని చెప్పానని పవన్ అన్నారు. వైసీపీకి అధికారాన్ని కట్టబెడితే భూకబ్జాలే కాదు… మీ ఇల్లు, ఆ కొండ, కొండ మీద పుట్ట, కొండపైనున్న చెట్టును కూడా దోచేస్తారని పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పులివెందుల కిరాయి రౌడీలకు భయపడమని పవన్ తేల్చి చెప్పారు.
ఏపీలో విద్యుత్ కోతలు.. ప్రభుత్వంపై పవన్ చురకలు!