ఏపీ రాజధానికి అన్యాయం జరిగితే ప్రధాని మోదీ, అమిత్షా దృష్టికి తీసుకెళ్తానని జనసేన అధినేత పవన్కల్యాణ్ అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిని ఇక్కడ వద్దంటున్నారంటే మోదీని, అమిత్షాను వ్యతిరేకిస్తున్నట్టేని చెప్పారు. ఫోక్స్వ్యాగన్ కేసులను బొత్స గుర్తించుకోవాలని అన్నారు. రాజధానిని మార్చాలని చూస్తే పోరాటం ఉధృతం చేస్తామని అన్నారు.
రాజధానిలో రైతులు భూములను అమ్ముకోవద్దని పవన్ సూచించారు.కాలమో లేదా ఈవీఎంల ఘనతతో వైసీపీ అధికారంలోకి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కారు ఇసుకతో ఆడుకుంటోందని, ఇది ప్రమాదకరమని పవన్ హెచ్చరించారు. కౌలు కోసం రాజధాని రైతులు భూములివ్వలేదని, ప్రజలను కన్నీరు పెట్టిస్తే ప్రభుత్వాలకు మనుగడ ఉండదన్నారు.
ఏడుకొండలు మినహా అంతటా వైసీపీ రంగులే: పవన్ కళ్యాణ్