హాస్య నటుడు వైసీపీ నేత అలీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కష్టాల్లో అలీకి అండగా ఉన్నానని, స్నేహమంటే ఇదేనా అని పవన్ ప్రశ్నించారు. రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండ్ సెంటర్లో పవన్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్పై నిప్పులు చెరిగారు. అలీని వైసీపీ నేతలు వాడుకుంటున్నారని తెలిపారు.
అలీకి ఎంపీ టికెట్ ఇస్తామంటే వైసీపీలో చేరాడని అన్నారు. తండ్రి శవం దొరక్కముందే సీఎం కావాలనుకున్న.. జగన్ రాష్ట్రానికి అవసరమా అని మరోసారి ప్రశ్నించారు. అలీ వైసీపీలో చేరడంపై గతంలో పవన్ తన అభిప్రాయాన్ని మీడియాకు తెలిపారు. జగన్ బలమైన నాయకుడని అలీ భావించాడు కాబట్టే వైసీపీలో చేరి ఉంటాడని వ్యాఖ్యానించారు.
దళితులను అణగతొక్కాలని ప్రభుత్వం కుట్ర: చినరాజప్ప