telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

టీడీపీ అసంతృప్తులు .. తలుపులు తెరిచే ఉంచామంటున్న జనసేన .. !

జనసేన అభ్యర్థి పాముల రాజేశ్వరిదేవి, పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తిని కలిసినట్టు తెలిసింది. పులపర్తికి సీటు కేటాయించకపోవడంతో ఆయన టీడీపీ అధిష్ఠానం పట్ల తీవ్ర అసంతృప్తిలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాముల రాజేశ్వరిదేవి ఎమ్మెల్యేను కలిసి జనసేనలోకి రావాలని కోరారు. తాను ప్రస్తుతం టీడీపీలోనే పద్ధతిగా ఉన్నానని, ఏ పార్టీలోకి వచ్చే ఉద్దేశం లేదని, ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని తెలిపినట్లు సమాచారం.

ఇదే విషయమై ఎమ్మెల్యేను వివరణ కోరగా రాజేశ్వరిదేవిని కలిసిన మాట వాస్తవమేనని, తాను ఏ పార్టీలోకి వెళ్లే ఉద్దేశం లేదని, అధిష్ఠానం నిర్ణయం మార్చుకుంటుందని భావిస్తున్నానని తెలిపారు.

Related posts