నంద్యాల లోక్ సభ నుంచి జనసేన పార్టీ తరపున బరిలో దిగిన సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత వారం రోజుల క్రితం నంద్యాలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో అస్వస్థతకు గురైన ఆయన హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో వైద్యులు చికిత్స అందిన్నప్పటికీ కోలుకోలేదు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై జనసేన వర్గాల్లో ఆందోళన నెలకొంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి, ఆపై టీడీపీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీడీపీ ఆయనకు టికెట్ ను నిరాకరించడంతో జనసేనలో చేరి, ఆ పార్టీ తరఫున బరిలోకి దిగారు.
next post
ఒకే దేశం ఒకే రాజ్యాంగం.. ముఖర్జీ కల నెరవేరింది: ఎంపీ సంజయ్