ఏపీలో ఇసుక కొరతను నిరసిస్తూ జనసేన విశాఖలో నిర్వహించిన లాంగ్ మార్చ్లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. ఐదు నెలలుగా ఇసుక సమస్యపై పోరాడుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని విమర్శించారు.
ఇంత శాడిస్ట్ ప్రభుత్వాన్ని చరిత్రలో చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇసుక కొరతతో కార్మికులు ఇబ్బందులు పడుతుంటే మంత్రులు కల్లు తాగిన కోతుల్లా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం మెడలు వంచి ఇసుకను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ప్రజలు నమ్మకంతో 150 సీట్లు గెలిపిస్తే ఐదు నెలల్లో అందరికీ జగన్ అన్యాయం చేశాడనని అచ్చెన్నాయుడు అన్నారు.