telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

దుష్ప్రచారంపై సైబర్ క్రైమ్ పోలీస్ కు జనసేన ఫిర్యాదు!

pawan-kalyan

సోషల్ మీడియాలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై చేస్తున్న దుష్ప్రచారంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాల వేదికగా ‘జనసేన’పై దుష్ప్రచారం చేస్తున్న వారిపై పై కఠిన చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదులో కోరారు. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రూ.2 వేల కోట్ల బ్లాక్ మనీని వైట్ మనీగా ఆయన మార్చారంటూ సోషల్ మీడియా ద్వారా వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. వైసీపీ సోషల్ మీడియా విభాగంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

Related posts