telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

తాజా ఫలితాలు .. తెరాస కు చెంపపెట్టు .. : జానారెడ్డి

janareddy on recent result in telangana

టీఆర్ఎస్ 88 అసెంబ్లీ స్థానాలను గెలిచి కూడా ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమంపై దృష్టి సారించడం మాని, ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తాను పార్లమెంట్‌కు పోటీ చేస్తానంటే తనకు టికెట్ కేటాయించేదని, కానీ తానెప్పుడూ పదవుల కోసం ఆశపడలేదన్నారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పారన్నారు. ఈ ఫలితాలను దృష్టిలో పెట్టుకునైనా ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. ఇకపై తాను హుజూర్‌నగర్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేయబోనన్నారు.

Related posts