పార్టీని బలోపేతం చేయాలని ప్రణాళికలు రచిస్తున్న జనసేన పార్టీకి ఊహించని షాక్ తగిలింది.రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు జనసేనకు గుడ్ బై చెప్పారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అల్లూరి కృష్ణంరాజు గతంలో రాజోలు ఎమ్మెల్యేగా పనిచేశారు.
అయితే ఎన్నికల్లో రాజోలు స్థానాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేయడంతో అక్కడ్నించి రాపాక వరప్రసాద్ పోటీ చేసి విజయం సాధించారు. కొన్నాళ్లుగా అల్లూరి కృష్ణంరాజు పార్టీ మారతారని ఊహాగానాలు గట్టిగానే వినిపించాయి. వ్యాపార రంగంలో ఉన్న ఆయనకు స్థానికంగా మంచి గుర్తింపు ఉన్నట్టు తెలుస్తోంది.