telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

గ్రామ వలంటీర్లపై జనసేన కార్యకర్తల దాడి!

New couples attack SR Nagar

ప్రభుత్వ పథకాల సర్వే కోసం ఏపీ ప్రభుత్వం నియమించిన గ్రామ వలంటీర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. సర్వే పేరుతో తమ ఇళ్లకు రావొద్దని గ్రామ వలంటీర్లపై న జనసేన పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా, సఖినేటిపల్లి మండలం, గుడిమూల గ్రామంలో చోటుచేసుకుంది. అంతేకాక, రాజేశ్ అనే వలంటీరును కారులో ఎక్కించుకుని కిడ్నాప్‌‌‌కు యత్నించినట్టు సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

వలంటీర్లు రాజేశ్, సునీల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలుపు రంగు స్విఫ్ట్ కారులో వచ్చిన జనసేన కార్యకర్తలు తనను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని అయితే, స్థానికులు వెంబడించడంతో గొంది గ్రామం వద్ద కారు నుంచి తనను కిందికి తోసేసినట్టు రాజేశ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts