telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కార్మికులకు ఉపాధి లేకుండా చేశారు.. వైసీపీ సర్కారుపై పవన్ ఫైర్

pawan-kalyan

వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పై జనసేనాని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన నెల్లూరు జిల్లా జనసేన కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేవలం టీడీపీపై కక్ష తీర్చుకోవడం కోసం 35 లక్షల మంది భవన నిర్మాణ రంగ కార్మికుల పొట్ట కొట్టారంటూ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. సర్కారు నిర్ణయాలు కార్మికులను రోడ్డుపైకి తీసుకువచ్చాయని ఆరోపించారు.రాత్రికి రాత్రే ఇసుక విధానం తీసివేస్తున్నామని ప్రకటిస్తే కార్మికుల పరిస్థితి ఏమైపోతుందని ప్రశ్నించారు.

15 రోజుల్లో కొత్త విధానం ప్రకటిస్తామన్న ప్రభుత్వం ఇప్పటికీ ఇసుక విధానంలో స్పష్టత ఇవ్వడంలేదని విమర్శించారు. ఇసుక సమస్య తీవ్రరూపు దాల్చడంతో తాము సమావేశమై కనీసం ఓ నిరసన యాత్ర చేద్దామని నిర్ణయించుకున్నామని పవన్ వెల్లడించారు. వైసీపీ సర్కారు తీసుకుంటున్న ప్రతి నిర్ణయం విమర్శలపాలవుతోందని అన్నారు. లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పుకుంటున్న సర్కారు అంతకంటే ఐదింతల మందికి ఉపాధి లేకుండా అన్యాయం చేశారని పవన్ విమర్శించారు.

Related posts