జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపాన్ని భారతీయులు పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారని ట్విట్టర్ లో వివరించారు. కులమతాలకు అతీతంగా భారతీయులందరూ జరుపుకునే పండుగ దీపావళి అని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని శ్రమజీవుల జీవితాల్లో ఈ దీపకాంతులు కొత్త కాంతులు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.
వర్షాకాలంలో వచ్చే క్రిమికీటకాలు అనారోగ్యాలు కలిగిస్తుంటాయని పేర్కొన్నారు. కీటకాలను పారద్రోలేందుకే దీపాలు వెలిగించి, బాణసంచా కాల్చుతుంటారని పవన్ వెల్లడించారు. అయితే పర్యావరణానికి భంగం కలగని రీతిలో పరిమితంగా టపాసులు కాల్చాలని ట్విటర్ లో సూచించారు.
జగన్ నిర్ణయంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తి: కేశినేని నాని