మహిళలపై దారుణాలకు పాల్పడే మానవ మృగాలను వదిలిపెట్టకూడదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన విషయంపై ఆయన స్పందిస్తూ ప్రకటన చేశారు. ఈ ఎన్కౌంటర్తో ఇలాంటి ఘటనలు మరోసారి జరగవని అనుకోవద్దని తెలిపారు. హత్యాచార ఘటన జరిగిన రాత్రి ఆ నలుగురు పోకిరీల మధ్య ‘దిశ’ ఎంత నరకాన్ని అనుభవించిందో తలచుకుంటేనే తనలో రక్తం మరిగిపోతోందని అన్నారు.
ఇలాంటి కేసుల్లో కోర్టులపరంగా తక్షణ న్యాయం లభించాలని, కేవలం రెండు, మూడు వారాల్లోనే దోషులకు శిక్షలు పడేలా నిబంధనలు తీసుకురావాలని పవన్ అభిప్రాయపడ్డారు. గతంలో నిర్భయ ఘటన తరువాత బలమైన చట్టాన్ని మన పార్లమెంట్ తీసుకొచ్చినప్పటికీ అత్యాచారాలు ఆగలేదని అన్నారు. అమ్మాయిల వైపు వక్రబుద్ధితో చూడాలంటేనే భయపడే విధంగా కఠిన చట్టాలు చేయాలని అభిప్రాయపడ్డారు.
చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత: నాదెండ్ల భాస్కరరావు