గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో అమరావతి రాజధాని తరలింపుపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఈ సమావేశం మధ్యలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సమావేశం జరుగుతుండగానే మధ్యలోనే లేచి పవన్ కల్యాణ్ ఢిల్లీకి బయలుదేరారు.
అమరావతిలో రైతుల పక్షాన పోరాటం చెయ్యాలని జనసేన భావిస్తోంది. త్వరలోనే విజయవాడలో కవాతు నిర్వహించే అంశంపై జనసేన ఈ సమావేశంలో చర్చించిన్నట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం ప్రముఖుల అపాయింట్మెంట్ పవన్ కల్యాణ్కు ఖరారయిందని అందుకే వెళ్లారని జనసేన నేతలు చెబుతున్నారు.
బెంగాల్ ఎన్నటికీ గుజరాత్ కాదు: మమతా బెనర్జీ