జమ్మూకశ్మీర్ లో ఈ రోజు జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లా జిల్లాలోని దంగర్పురా గ్రామంలో భద్రత దళాలకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిద్దరిని లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా జమ్మూ పోలీసులు గుర్తించారు.
అయితే దంగర్పురా ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్ బలగాలు కలిసి సంయుక్తంగా కూంబింగ్ చేపట్టారు. సోపోర్లోని అన్ని ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలను మూసివేశారు.