telugu navyamedia
రాజకీయ వార్తలు వ్యాపార వార్తలు

జమ్ముకశ్మీర్, లఢాక్ లలో రిలయన్స్  టాస్క్ ఫోర్స్: ముఖేశ్ అంబానీ

Mukesh ambani,PSL

ఇటీవల జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ జమ్ముకశ్మీర్, లడాఖ్ లలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారు. అక్కడ పరిశ్రమలు వస్తే, స్థానికులకు ఉద్యోగావగాశాలు పెరుగుతాయని అన్నారు. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పందించింది. రానున్న రోజుల్లో కేంద్రపాలిత ప్రాంతాలు జమ్ముకశ్మీర్, లడాఖ్ ల ప్రాంతాల అభివృద్ధిలో భాగస్వాములవుతామని ఆ సంస్థ అధినేత ముఖేశ్ అంబానీ తెలిపారు.

ఈరోజు ముంబైలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జమ్ముకశ్మీర్, లడాఖ్ ప్రజలకు అండగా నిలవాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. అ రెండు దీని కోసం రిలయన్స్ తరపున ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామని అన్నారు. అనంతరం ఆ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తామని చెప్పారు.

Related posts