telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

త్వరలో ఉగ్రవాదులకు గట్టి సమాధానం: కశ్మీర్‌ గవర్నర్‌

Jammu Governor reacted attack terrarists

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ శుక్రవారం స్పందించారు. ఈ విషయంలో ఇంటెలిజెన్స్‌ వర్గాల లోపం లేదన్నారు. దాడి జరిగే అవకాశమున్నట్లు ముందే సమాచారం అందింది. అయినా ఎక్కడో నిర్లక్ష్యం ఉంది. ఉగ్రవాదులున్న అంత పెద్ద వాహనాన్ని లోపలికి అనుమతించామంటే తప్పకుండా మన తనిఖీల్లో లోపం ఉందని సత్యపాల్‌ అన్నారు. అయితే తప్పకుండా దీనిపై త్వరలోనే ఉగ్రవాదులకు గట్టి సమాధానం ఇస్తామని ఆయన హెచ్చరించారు.

ఈ ఘటనకు కారణమైన ఏ ఒక్కరినీ విడిచిపెట్టేది లేదన్నారు. రాష్ట్రంలో ఉగ్రవాద ఆనవాళ్లు లేకుండా చేస్తామన్నారు.ఉగ్రవాదులపై గత కొన్ని రోజులుగా భారత్‌పై చేయి సాధిస్తుండటం పట్ల అసహనానికి గురైన వారు ఈ దాడికి పాల్పడ్డారన్నారు. చర్యలకు భారత్‌ దీటుగా బదులిస్తుండటంతో ఉగ్రవాదులు అసహనానికి గురయ్యారు. అందులో భాగమే ఈ దాడి జరిగందన్నారు. గత కొన్ని నెలలుగా ఉగ్రవాదుల సమీకరణ, కశ్మీర్‌లో రాళ్ల దాడులు ఆగిపోయాయన్నారు.

Related posts