జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కుప్వారా జిల్లాల్లోని హంద్వారాలో జవాన్లు ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఎదురుకాల్పులు కాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల్లో ఓ కమాండింగ్ ఆఫీసర్, మేజర్ కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
హంద్వారాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో జవాన్లు తనిఖీలు చేపట్టగా ఉగ్రవాదులు దాడికి దిగడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను జవాన్లు హతమార్చారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం కూంబింగ్ చేపట్టారు. కొనసాగుతున్నాయి. ఉగ్రదాడి నేపథ్యంలో హంద్వారాలో ఇంటర్నెట్ సౌకర్యాన్ని నిలిపివేశారు.
అపోజిషన్ లో ఉండటం టీడీపీకి కొత్తేమి కాదు: చంద్రబాబు