telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ప్రొ కబడ్డీ ఏడో సీజన్ : … మూడు విజయాలతో .. జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌..

jaipur won on haryana in pro kabaddi

నేటి ప్రొ కబడ్డీ ఏడో సీజన్ మ్యాచ్ లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ 37-21 తేడాతో హరియాణా స్టీలర్స్‌ను చిత్తు చేసింది. ప్రొ కబడ్డీ ఏడో సీజన్లో వరుసగా మూడో విజయం అందుకుంది. తొలి నుంచీ ఆధిపత్యం సాగించిన జైపూర్‌.. రెండో అర్ధభాగంలో ప్రత్యర్థిని రెండు సార్లు ఆలౌట్‌ చేసింది. హుడా (14 పాయింట్లు)కు తోడుగా సందీప్‌ దుల్‌ (6), విశాల్‌ (4) రాణించారు. హరియాణ రైడర్‌ నవీన్‌ను ఔట్‌ చేసి జైపూర్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత రెండు జట్లు నువ్వానేనా అన్నట్టు ఆడటంతో జైపూర్‌ 10-8తో దూసుకెళ్లింది. తొలి అర్ధభాగం మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా దీపక్‌ 2 పాయింట్లు తేవడం, హరియాణా రైడర్‌ కె.సెల్వమణిని పట్టేడయడంతో పింక్‌ పాంథర్స్‌ 13-8తో తొలి అర్ధభాగాన్ని ముగించింది. ఇక రెండో అర్ధభాగంలో జైపూర్‌ చెలరేగింది. వెంటవెంటనే పాయింట్లు సాధించింది.

తొమ్మిది నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా హరియాణాపై 10 పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. 36వ నిమిషంలో హరియాణా రెండో ఆసారి ఆలౌటవ్వడంతో స్కోరు 34-16గా మారింది. చివరికి జైపుర్‌ 37-21 విజయం అందుకుంది. సొంత స్టేడియంలో యు ముంబాను 23-27 తేడాతో ఓడించింది యూపీ యోధా. మోను గోయత్‌ (6), సుమిత్‌ (6), అషు సింగ్‌ (4) రాణించారు. రైడింగ్‌లో రెండు జట్లు 10 పాయింట్లతో సమంగా నిలిచినా 2 ట్యాకిలింగ్‌, 2 ఆలౌట్‌ పాయింట్లతో యూపీ గట్టెక్కింది. ముంబాలో రోహిత్‌ బలియన్‌ (6), సురిందర్‌ సింగ్‌ (4) ఫర్వాలేదనిపించారు. చెరో మూడు విజయాలు సాధించిన జైపూర్‌, దిల్లీ జట్లు 15 పాయింట్లతో పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.

Related posts