జైలులో ఖైదీల మధ్య చెలరేగిన ఘర్షణ వల్ల 15 మంది మృతిచెందారు. ఈ ఘటన బ్రెజిల్లోని మనాస్ పట్టణంలో ఉన్న అనిసో జాబిన్ కాంప్లెక్స్ జైలులో జరిగింది. విజిటింగ్ హవర్స్ సమయంలో ఖైదీల మధ్య ఘర్షణ తలెత్తినట్లు తెలుస్తోంది. విజిటర్స్ ముందే కత్తులతో ఖైదీలు కొందర్ని చంపేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
జైలులో చెలరేగిన హింసను అదుపు చేసినట్లు పోలీసులు చెప్పారు. రెండేళ్ల క్రితం బ్రెజిల్లోని ఓ జైలులో జరిగిన ఘర్షణలోనూ 56 మంది మృతిచెందారు. ప్రస్తుత లెక్కల ప్రకారం బ్రెజిల్లో ఖైదీల సంఖ్య 7 లక్షలుపైనే ఉంది.
వైసీపీ సర్కారు వైఖరితో రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదు: సోమిరెడ్డి