telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఏపీలో రెండో విడత జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘జగనన్న విద్యా దీవెన’ రెండో విడత నిధులను నేడు విడుదల చేయబోతోంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్ ఈ నిధులను విడుదల చేయనున్నారు. దాదాపు 10.97 లక్షల మంది విద్యార్థులకు రూ.693.81 కోట్లను గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి విడుదల చేయనున్నారు. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది.

ఏప్రిల్ 19న తొలి విడతను విడుదల చేయగా… ఈ రోజు రెండో విడత నిధులను విడుదల చేయనున్నారు. డిసెంబరులో మూడో విడత, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నాలుగో విడత నిధులను విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. విద్యారంగానికి సంబంధించి ఇప్పటి వరకు రూ. 26,677 కోట్ల నిధులను ఖర్చు చేశామని చెప్పింది. జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ ఆపై కోర్సులు అభ్యసించే వారికి రూ. 20 వేల చొప్పున వసతి, భోజన ఖర్చుల కొరకు ఇస్తోంది.

Related posts