telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రేపు ‘జగనన్న చేయూత’ పథకం ప్రారంభం!

cm jagan ycp

మహిళా స్వాలంభన కోసం వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘జగనన్న చేయూత’ పథకం రేపు ప్రారంభం కానుంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు లబ్ధి చేకూరనుంది.

లబ్దిదారులకు ప్రతి ఏటా రూ. 18,750 చొప్పున నాలుగేళ్లలో రూ. 75 వేలు ఆర్థిక సాయం చేయనున్నారు. ఈ పథకం ద్వారా 24 లక్షల నుంచి 25 లక్షల మంది పేద మహిళలు లబ్ధి పొందనున్నారు. నాలుగేళ్లకు గాను ఈ పథకానికి సుమారు రూ. 20 వేల కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు  చేయనుంది. 

Related posts