ఏపీ సీఎం జగన్ పై టీటీడీ ఆగమశాస్త్ర సలహాదారుగా నియమితుడైన రమణ దీక్షితులు ప్రశంసలు కురిపించారు. వంశ పారంపర్య అర్చకులకు పూర్వవైభవం తీసుకువస్తానని ఎన్నికల ముందు జగన్ హామీ ఇచ్చారని, ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని కొనియాడారు. సీఎం జగన్ నిర్ణయంపై అర్చకుల కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయని తెలిపారు.
జగన్ కు అర్చకులంతా రుణపడి ఉంటారని తెలిపారు. తనకు శ్రీవారి ఆగమ సలహా మండలి సభ్యుడిగా అవకాశం ఇచ్చారని, శ్రీవారికి కైంకర్యాలు చేసే అవకాశం కల్పిస్తామన్నారని రమణ దీక్షితులు తెలిపారు. మరో 30 ఏళ్లు జగన్ సీఎంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.