చాలాకాలంగా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న లంకా శ్రీధర్ కృషిని గుర్తించిన అధ్యక్షుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు ఆయన్ని రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు . లంకా శ్రీధర్, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ కోసం పనిచేస్తున్నారు . తూర్పు గోదావరికి చెందిన శ్రీధర్ హైద్రాబాద్లో స్థిరపడ్డారు . జగన్ మోహన్ రెడ్డి, వై .వి సుబ్బారెడ్డి , భూమన కరుణాకర్ రెడ్డి తో శ్రీధర్ కు సన్నిహిత సంబంధాలు వున్నాయి .
శ్రీధర్ బాగా చదువుకున్నవాడు , ప్రాంతీయ , జాతీయ , అంతర్జాతీయ రాజకీయ పరిజ్ఞానం వున్నవాడు . కంప్యూటర్లో అపారమైన పరిజ్ఞానం వున్నవాడు . రాష్ట్ర రాజకీయాలలో ఆయా సమస్యల పట్ల చక్కటి అవగాహన కలిగినవాడు . అవసరం వచ్చినప్పుడు తగిన సలహాలు కూడా ఇచ్చే ప్రతిభ కలిగినవాడు .అందుకే శ్రీధర్ సేవలను గుర్తించిన జగన్మోహన్ రెడ్డి పార్టీ రాష్ట్ర స్థాయి కార్యదర్శిగా ఎంపిక చేశారు .
ఈ సందర్భంగా శ్రీధర్ నవ్య మీడియా తో మాట్లాడుతూ … వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అంటే తనకు ఎంతో అభిమానమని , అందుకే ఆ పార్టీ విజయం కోసం తానూ పనిచేస్తున్నానని చెప్పారు . జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన ప్రజా ప్రస్తావన యాత్ర ప్రజల్లో అనూహ్యమైన స్పందన తెచ్చిందని , ఆ స్పందనే రేపటి విజయానికి బాటలు వేస్తుందని తామ నమ్ముతున్నాము , అందుకే తన వంతు సహాయాన్ని పార్టీకి అందిస్తున్నామని శ్రీధర్ చెప్పారు .
తన మీద నమ్మకంతో జగన్ మోహన్ రెడ్డి గారు అప్పగించిన ఈ భాద్యత మనస్ఫూర్తిగా నిర్వర్తిస్తానని శ్రీధర్ చెప్పారు .
ఆత్మలు ఘోషిస్తున్నాయి.. కేసీఆర్ కు ఉసురు తగులుతుంది