telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

జగన్ పార్టీ కార్యదర్శి గా లంకా శ్రీధర్

JAGAN,YSRCP, PARTY STATE SECRATERY,SRIDHAR LANKA
చాలాకాలంగా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా  పనిచేస్తున్న లంకా శ్రీధర్ కృషిని గుర్తించిన  అధ్యక్షుడు వై ఎస్  జగన్ మోహన్ రెడ్డి  గురువారం నాడు ఆయన్ని రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు . లంకా  శ్రీధర్,  వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ కోసం పనిచేస్తున్నారు . తూర్పు గోదావరికి చెందిన శ్రీధర్  హైద్రాబాద్లో స్థిరపడ్డారు . జగన్ మోహన్ రెడ్డి, వై .వి సుబ్బారెడ్డి , భూమన కరుణాకర్ రెడ్డి తో శ్రీధర్ కు సన్నిహిత సంబంధాలు వున్నాయి . 
శ్రీధర్ బాగా చదువుకున్నవాడు , ప్రాంతీయ , జాతీయ , అంతర్జాతీయ  రాజకీయ పరిజ్ఞానం  వున్నవాడు . కంప్యూటర్లో అపారమైన పరిజ్ఞానం వున్నవాడు . రాష్ట్ర రాజకీయాలలో  ఆయా సమస్యల పట్ల చక్కటి అవగాహన కలిగినవాడు .  అవసరం వచ్చినప్పుడు తగిన సలహాలు కూడా ఇచ్చే ప్రతిభ కలిగినవాడు .అందుకే శ్రీధర్ సేవలను గుర్తించిన జగన్మోహన్ రెడ్డి  పార్టీ రాష్ట్ర స్థాయి కార్యదర్శిగా ఎంపిక చేశారు . 
ఈ సందర్భంగా శ్రీధర్ నవ్య మీడియా తో మాట్లాడుతూ … వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అంటే తనకు ఎంతో అభిమానమని , అందుకే ఆ పార్టీ  విజయం కోసం తానూ పనిచేస్తున్నానని చెప్పారు . జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన ప్రజా ప్రస్తావన యాత్ర ప్రజల్లో అనూహ్యమైన స్పందన తెచ్చిందని , ఆ స్పందనే  రేపటి విజయానికి బాటలు వేస్తుందని తామ నమ్ముతున్నాము , అందుకే  తన వంతు సహాయాన్ని పార్టీకి అందిస్తున్నామని శ్రీధర్ చెప్పారు . 
తన మీద నమ్మకంతో జగన్ మోహన్ రెడ్డి గారు అప్పగించిన ఈ భాద్యత  మనస్ఫూర్తిగా నిర్వర్తిస్తానని శ్రీధర్ చెప్పారు . 

Related posts