telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రైతులు, మహిళలపై కాదు.. మీ ప్రతాపం కేంద్రంపై చూపించండి: కేశినేని నాని

kesineni-nani

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న రైతులు, మహిళల మీద ప్రతాపం చూపించడం కాదు… కేంద్రం మీద మీ ప్రతాపం చూపించి ప్రత్యేక హోదాను సాధిస్తే మంచిదని హితవు పలికారు.

ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామని ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానం ఏమైందని ఆయన ప్రశ్నించారు. మీరు, మీ 22 మంది ఎంపీలు ప్రత్యేక హోదాను ఎప్పుడు సాధిస్తారో అని రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్నారని అన్నారు. దీంతో పాటు ఏపీకి ప్రత్యేక హోదా లేదు అంటూ లోక్ సభలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇచ్చిన సమాధానానికి సంబంధించి ఈనాడు పత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన షేర్ చేశారు.

Related posts