telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వారికి పూర్తి స్థాయిలో వేతనాలు అందించాలి: సీఎం జగన్

ఏపీలో రోజురోజుకూ పెరిగిపోతోన్న కరోనా కేసులపై ముఖ్యమంత్రి జగన్‌ ఈ రోజు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. కరోనా వ్యాప్తి కట్టడికి అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో వారి సేవలు అభినందనీయమని కొనియాడారు.

వైద్యారోగ్యం, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తి స్థాయిలో వేతనాలు అందించాలని ఈ సందర్భంగా జగన్ ప్రకటన చేశారు. కరోనా నివారణకు ముందుండి పనిచేస్తోన్న సిబ్బందికి పూర్తి స్థాయిలో వేతనాలు ఇవ్వడం ఉత్తమమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో కరోనా కట్టడికి పంచాయతీరాజ్‌ శాఖ చర్యలు చేపట్టింది. ప్రతిరోజు గ్రామాల్లో హైపోక్లోరైడ్ పిచికారీ చేస్తున్నారు.

Related posts