telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నాడు ఏ చట్టం కింద వెనక్కు పంపించావు?: విజయసాయి

Vijayasai reddy ycp

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ లో విమర్శనాస్త్రాలు సంధించారు. గత సంవత్సరం ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ ఆందోళన చేసేందుకు విశాఖపట్నంకు వచ్చిన వైఎస్ జగన్ ను ఎయిర్ పోర్టు నుంచి ఏ చట్టం కింద తిప్పి పంపించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, “ఏం చట్టం కింద నన్ను వెనక్కు పంపుతారని బట్టలు చించుకుంటున్నాడు. ప్రజల మధ్య విష బీజాలు నాటే వారిని వంద సెక్షన్ల కింద లోపలికి నెట్టొచ్చు. ఏడాది కిందట స్పెషల్ స్టేటస్ కోరే ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన జగన్ గారిని, ప్రజా ప్రతినిధులను ఏ చట్టం కింద ఎయిర్ పోర్టు నుంచి తిప్పి పంపావు?” అని ప్రశించారు.

Related posts