విద్య ద్వారానే పేదవాడు ఉన్నతస్థాయికి ఎదగగలడని ఏపీ సీఎం జగన్ అన్నారు. శ్రీకాకుళం పర్యటనలో భాగంగా ఈ రోజు ఎచ్చెర్లలో విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఓ పేదకుటుంబం నుంచి ఒక్కరన్నా బాగా చదివి డాక్టరో, ఇంజినీరో అయితేనే వారి పరిస్థితి మారిపోతోందన్నారు.
పదేళ్లపాటు ప్రతిపక్ష నేతగానే కాకుండా, పాదయాత్ర సందర్భంగా అనేక సమస్యలను దగ్గరగా చూశానని తెలిపారు. తమ పిల్లలను చదివించాలని చాలామంది తల్లులకు ఆరాటం ఉంటుంది. కానీ చదివించలేని స్తొమత వారిది అనే విషయాన్ని గ్రహించనన్నారు. అందుకే ప్రతి తల్లి తన బిడ్డలను ప్రయోజకుల్ని చేయాలన్న సదుద్దేశంతో అమ్మ ఒడి పథకానికి రూపకల్పన చేశామని అన్నారు.