telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ సభలో మరో అపశృతి.. తొక్కిసలాటలో ఒకరి మృతి

YS Jagan Files Nomination Pulivendul

వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారంలో మరోసారి అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ రోజు కుప్పంలో జగన్ నిర్వహించిన రోషోకు భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చారు. కాగా ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటుచేసుకుంది. శాంతిపురం మండలం 121 పెద్దూరు గ్రామ తాజా మాజీ సర్పంచి బేట్రాయుడు తొక్కిసలాటలో (40) స్పృహ కోల్పోయారు.

దీంతో అతడిని వెంటనే వైసీపీ కార్యకర్తలు కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బేట్రాయుడు మరణించారు. రెండు రోజుల క్రితం గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో జగన్ ఎన్నికల ప్రచారంలో కరెంట్ షాక్ తగిలి ఒకరు మృతి చెందగా పది మంది గాయాలపాలయ్యారు. తాజాగా ఇప్పుడు తొక్కిసలాటలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 

Related posts