telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇసుక స్టాక్ యార్డ్ పాయింట్లను పెంచండి: జగన్

jagan

ఇసుక స్టాక్ యార్డ్ పాయింట్లను పెంచాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. నూతన ఇసుక విధానంపై సచివాలయంలో ఈరోజు అధికారులతో జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీలైనంత త్వరగా ఇసుక స్టాక్ యార్డులకు చేరేలా చర్యలు చేపట్టాలని అన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా లేకుండా చేయడానికి టెక్నాలజీని వాడాలని సూచించారు. ఏ స్థాయిలో కూడా అవినీతి జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు.

ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలను పెట్టాలని ఆదేశించారు. ఫుటేజీని మానిటరింగ్ చేసే వ్యవస్థ కూడా ఉండాలని అన్నారు. ప్రభుత్వంపై విమర్శలు రాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎక్కడెక్కడ ఇసుక కొరత ఉందో ఆయా ప్రాంతాల్లో నిర్మాణదారులకు సమాచారం ఇవ్వాలని జగన్ అన్నారు. ఇసుక విషయంలో ప్రభుత్వంపై రాళ్లు వేసేందుకు విపక్షాలు యత్నిస్తున్నాయని మండిపడ్డారు.

Related posts