telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

నేడు గృహనిర్మాణ శాఖపై .. ఏపీసీఎం సమీక్ష.. ఉగాదికి అందరికి శుభవార్త..

ఏపీసీఎం జగన్ రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఇళ్లు లేకుండా ఉండకూడదని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నేడు ఆయన గృహ నిర్మాణ శాఖపై సమీక్ష జరిపారు. ఈ ఏడాది శాచ్యురేషన్ విధానంలో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు. ఉగాదికల్లా ఇళ్ల స్థలాలు, పట్టాల పంపిణీ చేస్తామని సీఎం తెలిపారు. వైఎస్ఆర్ ఇళ్ల కింద నాలుగు విడతల్లో ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. గ్రామ సచివాలయంలో లబ్ధిదారుల జాబితాను ఉంచుతామన్నారు.

గత ప్రభుత్వ హయాం లో చదరపు అడుగుకు రూ.1,100 ఖర్చు అయ్యేదని, దానిని రూ.2,200-2,300కు పెంచి దోచేశారని సీఎం ఆరోపించారు. షేర్‌వాల్ పేరుతో పేదల మీద భారం వేస్తారా? అని ప్రశ్నించారు. అర్బన్ హౌసింగ్‌లో ఫ్లాట్లపై రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. సెక్ డేటా సరిచేయాలని, రీ-సర్వే చేయాలని ప్రధానికి లేఖ రాస్తానని సీఎం జగన్ స్పష్టం చేశారు.

Related posts