telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేడు కాపు ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం

ys jagan cm

ఏపీ సీఎం జగన్ కాపు సామాజికవర్గ ఎమ్మెల్యేలతో నేడు సమావేశం కానున్నారు. అగ్రవర్ణ పేదలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 10 శాతం రిజర్వేషన్లలో గత టీడీపీ ప్రభుత్వం 5 శాతం రిజర్వేషన్లను కాపులకు కేటాయించింది. గత ప్రభుత్వం కాపులకు కేటాయించిన 5 శాతం కాపు రిజర్వేషన్లను జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కాపు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో, తమ పార్టీకి చెందిన కాపు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి ఈరోజు సమావేశం కానున్నారు.కాపులకు కేటాయించిన కోటాను ఎత్తివేసిన అంశంపై ఎమ్మెల్యేలతో జగన్ చర్చించనున్నారు. వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. రానున్న రోజుల్లో ఈ అంశంపై ఎలా ముందుకు వెళ్లాలనే కార్యాచరణపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

Related posts