ఏపీ సీఎం జగన్ కాపు సామాజికవర్గ ఎమ్మెల్యేలతో నేడు సమావేశం కానున్నారు. అగ్రవర్ణ పేదలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 10 శాతం రిజర్వేషన్లలో గత టీడీపీ ప్రభుత్వం 5 శాతం రిజర్వేషన్లను కాపులకు కేటాయించింది. గత ప్రభుత్వం కాపులకు కేటాయించిన 5 శాతం కాపు రిజర్వేషన్లను జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కాపు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో, తమ పార్టీకి చెందిన కాపు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి ఈరోజు సమావేశం కానున్నారు.కాపులకు కేటాయించిన కోటాను ఎత్తివేసిన అంశంపై ఎమ్మెల్యేలతో జగన్ చర్చించనున్నారు. వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. రానున్న రోజుల్లో ఈ అంశంపై ఎలా ముందుకు వెళ్లాలనే కార్యాచరణపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.