రెండు తెలుగు రాష్ట్రాలు పచ్చగా ఉండాలని ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఆకాంక్షిస్తున్నారు. హైదరాబాద్ ప్రగతిభవన్ లో రెండు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను సంపూర్ణంగా వినియోగించుకోవాలని సీఎంలు నిర్ణయానికి వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ మూలకు నీరందించే విషయంలో కలిసి ముందుకు సాగుతామని ముఖ్యమంత్రులు చెబుతున్నారు.
వ్యవసాయానికి, తాగునీటికి, పరిశ్రమలకు నీటి కొరత రాకుండా చూడాలని ఆకాంక్షిస్తున్నారు. నదీ జలాల వినియోగంపై గతంలో ఉన్న వివాదాలను మరిచిపోయి, రెండు రాష్ట్రాలకు మేలు చేసే విషయంలో ఏకాభిప్రాయంతో ఉండాలని అనుకుంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ వేర్వేరు అనే భావన తమకు లేదని, రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలన్నదే తమ అభిమతమని ఇద్దరు సీఎంలు చెప్పుకొచ్చారు.
చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్కు పడుతుంది : నారాయణ