పాదయాత్ర ద్వారా ప్రజల కష్టనష్టాలపై తనకు అవగాహన ఏర్పడిందని ఏపీ సీఎం జగన్ అన్నారు. అందుకే ఇప్పుడు ప్రతిక్షణం ప్రజల సంక్షేమం కోసమే పరిపాలన సాగిస్తున్నానని తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలోసీనియర్ సంపాదకుడు కె.రామచంద్రమూర్తి రాసిన ‘జయహో’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి జగన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయనని స్పష్టం చేశారు. పాదయాత్ర సందర్భం మూడు వేల కిలోమీటర్లకు పైగా తిరిగానని చెప్పారు. ఆ సమయంలో రోడ్డు పక్కన చిన్న టెంటులో పడుకునేవాడ్నని జగన్ గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ పాదయాత్రను తలుచుకుంటే గొప్ప ఉత్సాహం కలుగుతుందని చెప్పారు.