telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి: జగన్

jagan

అక్రమాస్తుల కేసులో తొలిసారిగా సీఎం హోదాలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానం ముందు జగన్ హాజరయ్యారు. ఇకపై తనకు ఈడీ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు. తాను కీలకమైన పదవిలో ఉన్నందున కోర్టుకు హాజరు కాలేనని తెలిపారు.

తన తరఫున కేసులో నిందితుడిగా ఉన్న మరో వ్యక్తి హాజరవుతారని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు జగన్ తరఫు న్యాయవాది కోర్టు ముందు ఓ పిటిషన్ వేయగా, జడ్జి దాన్ని పరిగణనలోకి తీసుకుని సీబీఐ అభిప్రాయాన్ని కోరారు. ఆపై కోర్టు విచారణను తదుపరి శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.

Related posts