telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కలెక్టర్లు, ఎస్పీలకు విందు..ఆహ్వానాలు పంపిన జగన్

jagan

కలెక్టర్లు, ఎస్పీలకు విందు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం ఇచ్చే విందుకు హాజరు కావాలని అందరికీ జగన్ ఆహ్వానాలు పంపారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు వివిధ విభాగాల పోలీసు కమిషనర్ లు కూడా హాజరు కానున్నారు.

ఈ విందులో జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 13 టేబుల్స్ ఏర్పాటు చేయనున్నారు. ,ఒక్కో టేబుల్ వద్ద కనీసం 10 నిమిషాల పాటు గడుపనున్నారు. జిల్లాల పరిస్థితులు, సమస్యల గురించి వారిని అడిగి తెలుసుకుంటారని సమాచారం. వాటికి పరిష్కార మార్గాలపై సలహాలు అడుగుతారని తెలుస్తోంది. ఇక ఈ విందులో సంప్రదాయ ఆంధ్రా వంటకాలతో పాటు నార్త్, సౌతిండియన్ వంటలను వడ్డిస్తారని సీఎంఓ వర్గాలు వెల్లడించాయి.

Related posts