telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విశాఖ క్రేన్ ప్రమాదంపై సీఎం జగన్ విచారం

cm jagan ycp

విశాఖలోని హిందూస్థాన్ షిప్ యార్డులో భారీ క్రేన్ కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 10కి పెరిగింది. ఈ ప్రమాదంపై ఏపీన్ సీఎం జగన్ ఆరా తీశారు. ఘటన ఎలా జరిగిందన్న దానిపై వివరాలు తెలుసుకున్నారు.

ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్ లను ఆదేశించారు. మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా షిప్ యార్డు ప్రమాదంపై స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు.

Related posts