ఏపీ సీఎం జగన్ తో రిలయన్స్ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీ భేటీ ముగిసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శనివారం ఈ సమావేశం జరిగింది. దాదాపు గంటన్నర పాటు సీఎం జగన్తో అంబానీ బృందం చర్చలు జరిపింది. ఏపీలో పరిశ్రమల ఏర్పాటు అంశంపై వీరు చర్చించినట్టు సమాచారం.
ఈ సమావేశంలో అంబానీతో పాటు ఆయన కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ ఎంపీ పరిమళ్నత్వానీ పాల్గొన్నారు. కాగా, సమావేశం ముగిసిన అనంతరం సీఎం నివాసం నుంచి తిరిగి ముంబైకు అంబానీ బయలుదేరారు.
విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం రాజకీయం: వీహెచ్