ఆంద్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉన్నతాధికారుల పై బదిలీ వేటు వేయడం, కొత్త నియామాకాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా జగన్ వెంటనే ఉంటూ పాద యాత్రతో సహా పలు కార్యక్రమాలను విజయవంతం చేసిన నాగేశ్వర రావు ను పిఎ గా ఎంపిక చేసుకున్నారు. సీఎం పిఎ అంటే అంతో ఆక్టివ్ గా ఉండాలి. కొన్ని విషయాల్లో తక్షణమే స్పందించాలి.
సీఎం జగన్ దూకుడుకు తగ్గట్టుగా ఉండే నాగేశ్వర రావు ను పిఎ గా నియమిస్తూ ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. వివిధ మీడియాలో పనిచేసిన అనుభవం 11 సంవత్సరాలుగా జగన్ వెంటనే ఉంటూ పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన నాగేశ్వర రావు ను జగన్ పిఎ గా ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది.