telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమిత్ షాతో జగన్ భేటీ మరోసారి వాయిదా!

jagan attending guntur iftar tomorrow

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో జరగాల్సిన ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ మరోసారి వాయిదాపడింది. జగన్ కు ఇచ్చిన అపాయింట్ మెంట్ ను రద్దు చేసుకుంటున్నట్టు అమిత్ షా కార్యాలయం నుంచి జగన్ కు సమాచారం అందింది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనే అపాయింట్ మెంట్ క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం ముగిసి, ప్రచారం అయిపోయేంత వరకూ అమిత్ షా బిజీగా ఉంటారని, ఎవరికీ విడిగా అపాయింట్లు ఇచ్చే పరిస్థితి లేదని హోమ్ శాఖ అధికారులు వెల్లడించినట్టు సమాచారం.

కాగా, ఇటీవలి కాలంలో అమిత్, జగన్ ల భేటీ రద్దు కావడం ఇది రెండోసారి. ఇక అమిత్ షా అందుబాటులో లేకపోవడంతో జగన్ తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. వాస్తవానికి నేడు ఢిల్లీకి వెళ్లి పలు అంశాలపై అమిత్ షా తో జగన్ చర్చించాల్సి వుంది. 

Related posts