రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి ఉండేందుకు ప్రతిజ్ఞ చేద్దామని ఏపీ సీఎం జగన్ పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగానికి ఆమోదం లభించి 70 ఏళ్లు అయిన సందర్భంగా ఏపీ సీఎం జగన్ ట్విట్టర్ లో స్పందించారు. 1949 నవంబరు 26న భారత రాజ్యాంగం రాజ్యసభలో ఆమోదం పొందింన విషయం తెలిసిందే.
దృఢమైన రాజ్యాంగాన్ని మనకు అందించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నాయకత్వంలోని మేధావులను మరోసారి స్మరించుకుందాం అని జగన్ ట్వీట్ చేశారు. 70 ఏళ్ల తర్వాత కూడా చెక్కుచెదరని రీతిలో ప్రగాఢమైన సైద్ధాంతిక బలం ఉన్న రాజ్యాంగాన్ని ప్రసాదించారని కొనియాడారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానత్వం అందించే రాష్ట్ర నిర్మాణానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.