ప్రభుత్వం బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం చేస్తున్న అధికారిపై చర్యలు చేపట్టింది. నెల్లూరు జోన్స్టోర్స్ కంట్రోలర్ జగదీష్బాబుపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్ల రోల్స్ పంపిణీలో జగదీష్బాబు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు నిర్థారించిన ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.
మొత్తం ఘటనపై విచారణకు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ సురేంద్ర బాబు ఆదేశించారు. జగదీష్ బాబు అనాలోచిత నిర్ణయం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ప్రభుత్వ ప్రతిష్టకు కూడా భంగం వాటిల్లిందని ఆర్టీసీ ఎండీ సురేంద్ర బాబు చెప్పారు.
రాహుల్ హీరో..మోడీ జీరో: విజయశాంతి