telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గురువుకు మంత్రి జగదీష్ రెడ్డి పాదాభివందనం

jagadish reddy

గురుపౌర్ణమి రోజున తమకు విద్య నేర్పిన గురువులను పూజించడం ఆనవాయితి. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖా మంత్రి జగదీష్ రెడ్డి గురుపౌర్ణమిని పురస్కరించుకొని తన గురువుని పూజించారు. తన చిన్ననాటి గురువు సుబ్బయ్య మాస్టర్ ఇంటికి వెళ్లి ఆయనకు మంత్రి జగదీష్ రెడ్డి పాదాభివందనం చేశారు. అనంతరం పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించారు.

ఆయనకు నమస్కరించి గురు దక్షిణగా రూ.పదివేలు తన గురువుకి అందజేశారు. గురుపౌర్ణమికి గురువుని పూజించి వస్త్రం, పుష్పాలు, ధాన్యం లాంటివి సమర్పించడం ఆనవాయితి. అందుకే మంత్రి నగదు రూపంలో గురు దక్షిణగా సమర్పించారు. మంత్రి ఇలా వచ్చి తనకు గురుపూజ చేయడం పట్ల విశ్రాంత ఉపాధ్యాయులు సుబ్బయ్య హర్షం వ్యక్తం చేశారు.

Related posts