వకీల్సాబ్ సినిమా పూర్తయిన తర్వాత పవన్ దర్శకుడు క్రిష్తో సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా కొత్త లుక్స్తో కనిపించనున్నారు. ఈ సినిమాతో పవన్ తన కెరీర్లో మొట్టమొదటి సారి పీరియాడిక్ కథలో నటిస్తున్నారు. ఈ సినిమా మొగల్ సామ్రాజ్యం నాటి కథతో రూపొందుతుంది. అంతేకాకుండా ఈ సినిమా పవన్ కెరీర్లో చేసిన సినిమాలన్నింటిలోకి భారీ బడ్జెట్ సినిమా అని వార్తలు వస్తున్నాయి. వీటితో పాటుగా ఈ సినిమా పేరు విషయంలో కూడా అనేక వార్తలు వచ్చాయి. ఈ సినిమాకి మొదట విరూపాక్ష అనే పేరును ఫిక్స్ చేశారని టాక్ నడిచింది. ఆ తరువాత ఓం శివమ్ పేరు పరిశీలనలో ఉందని అన్నారు. ఇప్పుడు తాజాగా హరహర వీరమల్లు అనే టైటిల్ ఖరారు అయిందని, ఈ పేరును రిజిస్టర్ కూడా చేయించారని సమాచారం. ఇక హీరోయిన్ విషయానికొస్తే ఈ సినిమాలో శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కథానాయికగా చేస్తున్నారు. ఈ సినిమాలో జాక్వెలిన్ యువరాణి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. అంతేకాకుండా ఇందులో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా చేస్తున్నట్లు ఇటీవల తెలిసింది. ఈ సినిమాలో బుల్లితెర బ్యూటీ అనసూయ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తుంది.
previous post
వైసీపీ ప్రభుత్వానికి ఆత్రమే తప్ప శ్రద్ధ కొరవడింది: కన్నా