టిక్ టాక్ యాప్కి భారతదేశంలో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలీన్ ఫెర్నాండెజ్ ‘సాహో’ సినిమాలో ‘బ్యాడ్ బాయ్’ అనే సాంగ్ లో తన అందాలను ఆరబోసింది. ఈ భామ ఇప్పుడు ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ అయిన టిక్ టాక్లో టాప్ స్థానంలో ఉంది. ఇండియాలో టిక్ టాక్ టాప్ సెలబ్రిటీలలో జాక్వెలీన్ ప్రథమ స్థానంలో నిలిచింది. శ్రీలంకకు చెందిన ఈ బ్యూటీ ‘అలాదిన్’ సినిమాతో బాలీవుడ్ కు పరిచయమైంది. కానీ జాక్వెలీన్కు బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం ‘మర్డర్ 2’. ఈ సినిమా తర్వాత సినిమా అవకాశాలు పెరిగాయి. జాక్వెలీన్కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్లో ఉంది. 2019 సంవత్సరం ముగుస్తున్న సందర్భంగా టిక్ టాక్లో బాగా పాపులారిటీ తెచ్చుకున్న టాప్ 50 సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. అందులో జాక్వెలీన్ ఫెర్నాండెజ్ టాప్ స్థానంలో ఉన్నారు. ఈమెకు టిక్ టాక్లో 9.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో రితేష్ దేశ్ముఖ్ (6.8 మిలియన్), ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ (2.2 మిలియన్) ఉన్నారు. హీరోయిన్ల పరంగా జాక్వెలీన్ ఫెర్నాండెజ్ టాప్ స్థానంలో ఉన్నప్పటికీ.. ప్రముఖ బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్ ఆమెను మించిపోయారు. ఈమెకు టిక్ టాక్లో ఏకంగా 12.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. నేహా పాడిన ‘ఓ సాకి సాకి’ పాట రికార్డులు బద్దలుకొట్టింది. ఈ పాటపై నేహా ఎన్నో టిక్ టాక్ వీడియోలు చేసింది. అలా ఆమెకు బీభత్సమైన ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ పాటకు టిక్ టాక్లో రెండు వందల కోట్ల వ్యూస్ వచ్చాయి.
previous post