వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా రూపొందిస్తున్న చిత్రం “మహర్షి”. మహేష్ 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలని వేగవంతం చేసి చిత్రాన్ని మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రబృందం. దిల్ రాజు, అశ్వినీదత్ , పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ స్నేహితుడిగా అల్లరి నరేష్ నటిస్తున్నారు. “మహర్షి”లో మహేష్ మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నటించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన 5 మందిలో ఒకడిగా ఉండే మహేష్ కార్పోరేట్ అధిపతిగా యూఎస్ నుండి తిరిగివచ్చి వ్యవసాయంలో రైతులకు సరికొత్త విధానాన్ని అందించే పాత్రలో కనిపించబోతున్నారట. ఈ చిత్రం విడుదలైన తర్వాత మహేష్ తన 26వ చిత్రంగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నాడు.
previous post
next post
ఎన్టీఆర్, అల్లుఅర్జున్ లతో సినిమా అంటే నిద్ర పట్టదు… నిధి అగర్వాల్